తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు
కేంద్ర ఎన్నికల సంఘం టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మార్చుకోవచ్చని అధికారిక ప్రకటన చేయడం తో..తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేసారు సీఎం కేసీఆర్. పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని ఈ ఏడాది దసరా పర్వదినం రోజున సీఎం కేసీఆర్ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకే ఈరోజు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు అని కేసీఆర్ ఆ రోజున తీర్మాన ప్రతిని చదివి వినిపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్చించిన ఈసీ.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది.