కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు వేస్టేః విజయసాయిరెడ్డి ఎద్దేవా
.అమరావతిః వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పై మరోసారి సెటైర్లు వేశారు. ఏపీలో నోటాతో కలిసి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అనుభవంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఈజీగా చీలిపోతారని చెప్పారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు కూడా వేస్టేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలని… వైఎస్ఆర్సిపికి ఓటు వేయాలని కోరారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.