మంత్రి వేముల ప్రశాంత్ రెడ్ది మాతృమూర్తి కి నివాళ్లు అర్పించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ కనుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం (అక్టోబర్ 12)న తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ క్రమంలో మంజులమ్మ భౌతిక కాయానికి కొద్దీ సేపటి క్రితం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి వేములను, ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.