ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో తొలిసారి సమావేశం అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ తో ఆశీర్వాదం తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరు, ఫలితాలపై కాసేపు వారితో చర్చించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏం చేయాలనే దానిపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడూ నిలదీయాలని నేతలకు సూచించారు.