ముంబై లో కెసిఆర్ ఫ్లెక్సీలు
ఇవాళ మహారాష్ట్రలో పర్యటన
Mumbai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు జాతీయ పార్టీల నాయకులను ఆయన కలిశారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఇవాళ ఆయన భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై నగరంలో ‘ దేశ్ కా నేత కేసీఆర్ ‘ నినాదంతో ఫ్లెక్సీలు వెలిశాయి. ముంబై పర్యటనకు ఒక్క రోజు ముందే ముంబైలో తెలంగాణ వాసులు సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
తెర – సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/