ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఘడియలు రాబోతున్నాయి – ఎమ్మెల్సీ కవిత

అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 22వ తేదీన ఆలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ సందర్బంగా ఈ వేడుకను చూసేందుకు యావత్ భక్తులు అతృతతో ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్నీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత చెప్పుకొచ్చారు. దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఘడియలు రాబోతున్నాయి. అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతోంది అని పేర్కొన్నారు. ‘శుభ పరిణామం… అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ట, కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో… తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు… జై సీతారామ్’ అని ట్వీట్ చేశారు.

ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4 వేల మంది సాధువులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఒక వారం ముందు నుంచే అంటే జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయి.