తెలంగాణలో టిడిపి రాజకీయాలు చెల్లవుః కవిత

టిడిపిని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్య

kavitha-reaction-to-chandrababu-comments-that-he-will-strengthen-tdp-in-telangana

హైదరాబాద్‌ః తెలంగాణలో టిడిపి బలంగా ఉండాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మం సభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టిడిపి ఎక్కడుంది అనే వాళ్లకు ఈ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే సమాధానమని అన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టిడిపికి ఉందని, తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ది చెందేదా? అని ప్రశ్నించారు. వివిధ పార్టీల్లోకి వెళ్లిన వారంతా మళ్లీ టిడిపిలోకి రావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణలో టిడిపి రాజకీయాలు చెల్లవని ఆమె అన్నారు. ఇక్కడ టిడిపిని చంద్రబాబు మళ్లీ తీసురావాలనుకుంటున్నారని… ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు వచ్చి మళ్లీ రాజకీయం చేద్దామంటే కుదరదని అన్నారు. చుక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒక్కడే అన్నట్టుగా తెలంగాణలో కెసిఆర్ ఒక్కరేనని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/