ఆ మంత్రి చదివింది తొమ్మిది…సంపాదించిన ఆస్తి రూ. 1,609 కోట్లు

చాలామంది ఎంత చదివితే అంత సంపాదిస్తారని అంటారు..కానీ ఈరోజుల్లో చదువుకున్న వారికన్నా పెద్దగా చదవు కోనివారే బాగా సంపాదిస్తున్నారు. తాజాగా ఓ బిజెపి ఎమ్మెల్యే చదివింది తొమ్మిదైతే..సంపాదించిన ఆస్తి రూ. 1,609 కోట్లు. ఈ విషయాన్నీ ఆయనే బయటకు తెలిపారు. మే 10 న కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఎంటీబీ నాగరాజు తన ఆస్తులను ప్రకటించారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన అఫిడవిట్‌లో కళ్లు చెదిరే ఆస్తులను ప్రకటించారు. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న నాగరాజు తనకు రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో తన భార్య పేరిట రూ. 536 కోట్ల చరాస్తులు, రూ. 1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. అలాగే, ఇద్దరికీ కలిపి రూ. 98.36 కోట్ల రుణాలున్నట్టు పేర్కొన్నారు. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించినట్లు తెలుస్తుంది. ఈయన ఆస్తుల విలువ చూసి అంత షాక్ అవుతున్నారు.