బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ప్రచారం ఫై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని, తెలంగాణ పై ఫోకస్ చేస్తానని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పై స్పందించిన రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ప్రాంత నేతలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.