ఈ నెల 8న త్రిపురలో పర్యటించనున్న ప్రధాని మోడీ
8న త్రిపురలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..
న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించబోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్ అధికారి తెలిపారు. త్రిపురలో ప్రధాని పర్యటనకు సంబంధించి ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం ఎస్పీజీ బృందం కూడా త్రిపురకు చేరుకోనుంది.