కమల్ నాథ్ బలపరీక్ష రేపు
పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విప్ జారీ
Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ రేపు (సోమవారం) బలపరీక్షను ఎదుర్కోనున్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
సోమవారం బీజేపీ సభ్యులందరూ తప్పని సరిహా అసెంబ్లీకి హాజరు కావాలంటూ ఆ విప్ లో పేర్కొంది.
జ్యోతిరాదిత్య సింధియా మద్దతు దారులు కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో మహారాష్ట్రలోని కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారమే కమల్ నాథ్ బలపరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/