ముంబయిలో నిర్భయ తరహా ఘటన..మహిళ మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

ముంబయి : నిర్భయ తరహాలో ముంబయిలో ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. సాకినాకా ప్రాంతంలో జరిగిన ఈ హేయమైన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

శుక్రవారం ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు, ఆమెను క్రూరంగా హింసించారు. ఇనుపరాడ్డును ఆమె ప్రైవేట్ భాగాలలోకి చొప్పించడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను గట్కోపర్ రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి కీలకం కానుంది. ఈ ఘటన అనంతరం ఓ వ్యక్తి టెంపోలో పారిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/