మధ్యప్రదేశ్ సిఎం కమల్నాథ్ రాజీనామా
బలపరీక్షకు ముందే కమల్నాథ్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ సిఎం కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్నాథ్ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించే ముందేు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవిషయం వెల్లడించారు. మధ్యప్రదేశ్లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోవడంతో ఆయన బలపరీక్ష ఎదుర్కోక ముందే రాజీనామా చేయడం గమనార్హం. తన అధికారిక నివాసం నుంచి కమల్నాథ్ గవర్నర్ లాల్జీ లాండన్ వద్దకు బయలుదేరారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/