ఇటలీని అతలాకుతలం చేస్తున్న కరోనా

ఇటలీలో ఒక్క నెలలోనే రూ.3,405కు చేరిన మృతుల సంఖ్య

Coronavirus in Italy
Coronavirus in Italy

ఇటలీ: కరోనా వైరస్‌ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది. చైనాలో మాత్రం నిన్నటి వరకు నమోదైన మరణాలు 3245 మాత్రమే. ఇటలీలో 24 గంటల వ్యవధిలోనే 427 మరణాలు సంభవించడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. మరోవైపు, చైనాలోపుట్టిన ఈ వైరస్ అక్కడ క్రమంగా కనుమరుగవుతోంది. బుధవారం అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ దేశ వైద్యశాఖ నిర్ధారించింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. స్పెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 209 నుంచి ఒక్కసారిగా 767కు పెరగడం గమనార్హం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/