తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌–2021 ఫలితాలు కొద్దిసేపటి క్రితం వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేసారు. అభ్యర్థులు ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.మొత్తం మూడు సెషన్లలో ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో అధికారులు నిర్వహించారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈ పరీక్షకు దాదాపు 56,962 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

ఈ పరీక్షలో మొత్తం 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన లోకేశ్ మెుదటి ర్యాంకు సాధించగా, సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మేడ్చెల్ కు చెందిన నవీనక్షంత, రాజశేఖర చక్రవర్తి వరుసగా మూడు, నాలుగో ర్యాంకులు సాధించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆనంద్‌పాల్‌ ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటినట్లు లింబాద్రి తెలిపారు.