6న ప్రారంభం కానున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు

కాచిగూడ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మార్గం

kachiguda-yeshwantpur-vande bharat-express-to-be-launched-on-6th-of-august

హైదరాబాద్‌ః తెలుగు ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

నంద్యాల జిల్లా డోన్ మీదుగా వెళ్లే ఈ రైలు ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు ఈ రైలును స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం-5పై నిలిపి ఉంచారు. దీంతో పాటు ప్రధాని మోడీ, అమృత్ భారత్ స్టేషన్లు మల్కాజిగిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్‌లో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.