పోలింగ్ కేంద్రం నుండి పరుగులు పెట్టిన కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న ఘటనల మధ్య అంత ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్ లలో ఓటింగ్ సరళిని గమనిస్తున్నారు. ఈ క్రమంలో కేఏ పాల్ పోలింగ్ కేంద్రంలో సరళిని పరిశీలించి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధకాక అందరూ ఆశ్చర్యపోయారు.

ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానని , అలాగే పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశానని.. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. మునుగోడు ప్రజలు తెలివైనవారని.. వారికి ఏం కావాలో.. ఎవరైతే వారికి సరైన న్యాయం చేయగలరో తెలుసన్నారు. వారి ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేయగలరో వారికి బాగా తెలుసుని.. నియోజకవర్గ ఓటర్లు తమ ఓటుతో సరైన నిర్ణయమే తీసుకుంటారన్నారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలో పాల్ కొడలు జ్యోతి ఆందోళనకు దిగారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కండువాలు తీసుకొని పోలింగ్ బూత్ సమీపంలో ప్రచారం చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.