రేపు యాదాద్రికి సీఎం కెసిఆర్, జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రేపు యాదాద్రిని సందర్శించనున్నారు. సీఎం తో పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ యాదాద్రికి వెళ్లనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.

కాగా, సీఎం కేసీఆర్ యాదాద్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/