ఏపీకి 3.60 లక్షల కొవిషీల్డ్ డోసులు
గన్నవరంలో రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలింపు

ఏపీకి తాజాగా 3.60 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. అనంతరం గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను అధికారులు తరలించారు. ఇక్కడి నుండి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/