ఫేర్వెల్ పార్టీ కోసం పబ్ను బుక్ చేసుకున్నారట..
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్ కేసు..రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్న ఇంకా పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకోవడం , అసలు నిందితులను వదిలి అమాయకులను కేసులో ఇరికిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడం తో ఈ కేసు గురించి అంత మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ పబ్ కు ఎవరెవరు వచ్చారు..ఎందుకు వచ్చారు..వచ్చినవారంతా ఎవరు అనేది పోలీసులు బయటకు లాగారు.
కార్పొరేట్ స్కూల్ ఫేర్వెల్ పార్టీ కోసమే ఈ పబ్ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 150 మంది స్టూడెంట్స్ కోసం ఈ పబ్ బుక్ చేశారట. నిషాన్, అయాన్, ఆదిత్య అనే వ్యక్తులు పార్టీ కోసం బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం వారు రూ.2 లక్షలు కూడా చెల్లించినట్టు సమాచారం. వీరంతా ఇంటర్ సెకండియర్ స్టూడెంట్స్ అని సమాచారం. ఈ ఘటనకు సంబదించి ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురు నిందితులను ఈరోజు కోర్టులో హజరుపరిచి రిమాండ్కి తరలించనున్నారు. జూబ్లిహిల్స్ ఠాణాలో సాదుద్దీన్ మాలిక్ను పోలీసులు విచారించారు. వైద్యపరీక్షల నిమిత్తం మాలిక్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్కు తరలించనున్నారు. అరెస్టయిన మరో ఇద్దరు నిందితులైన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారునితో పాటు ఇంకో మైనర్ను పోలీసులు విచారిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు. అనంతరం ఇద్దరు మైనర్లను జువెనైల్ హోంకి తరలించనున్నారు. ఇక పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.