తిరుమల శ్రీవారి సేవలో జేపీ నడ్డా

సాయంత్రం శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ

jp-nadda-visits-tirumala-venkateswara-swamy-temple

తిరుమలః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు ఏపిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహ రావు, ఉమ్మడి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరికొందరు బిజెపి నాయకులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జీవీఎల్ నరసింహరావుతో ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం జేపీ నడ్డా తిరుచానూరులో కార్యకర్తలతో భేటీ కానున్నారు. తిరిగి సాయంత్రం 5.00 గంటలకు శ్రీకాళహస్తిలోని భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనపై నడ్డా ప్రజలకు వివరించనున్నారు. బహిరంగ సభ అనంతరం తిరిగి ఢిల్లీకి నడ్డా వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా రేపు విశాఖపట్నంలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు.