భారత్లో అగ్రస్థానానికి రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్ తాజా గణాంకాలు వెల్లడించాయి. జియో సేవలు అందుబాటులోకి రాకమునుపు ఎయిర్టెల్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నవంబర్ నాటికి జియో చందదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్టెల్ నిలిచాయి. అక్టోబర్ నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే వొడాఫోన్ ఐడియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటకీ రెండో స్థానంలో కొనసాగుతుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/