విశాఖలో చిక్కుకున్న జపాన్ పౌరులు
ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలింపు
విశాఖపట్నం: గత నెలలో విధించిన లాక్డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకున్న ఆరుగురు జపాన్ పౌరులను ప్రత్యేక విమానంలో బెంగుళూరు కు పంపించారు. అక్కడ ఇతర జపనీయులతో కలిసి నేటి రాత్రికి ప్రత్యేక విమానంలో వారు జపాన్ బయలుదేరుతారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానాన్ని జపాన్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఈ సందర్బంగా విశాఖ ఎయిర్పోర్టు అధికారి రాజ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతు నిన్న ఉదయం 10:35 గంటలకు ఎయిట్ సీటర్ ఛార్టెడ్ ఫ్లయిట్లో జపాన్ పౌరులు ఆరుగురిని బెంగుళూరుకు పంపించామని, లాక్డౌన్ కారణంగా వారు విశాఖలో చిక్కుకు పోయారని తెలిపారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వారు జపాన్కు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/