యువశక్తి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత ఫోకస్ అంత రాబోయే ఎన్నికలపై పెట్టాడు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్..ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఓటమి చెందినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా..ఇంకాస్తగా ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి అంటూ పలు కార్యక్రమాలతో ప్రజల్లో నిలిచినా పవన్ కళ్యాణ్..ఇప్పుడు యువశక్తి పేరుతో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు.

వ‌చ్చే ఏడాది ప‌లు జిల్లాల్లో యువ‌శ‌క్తి స‌భ‌లు నిర్వహించనున్నట్లు మనోహర్ తెలిపారు. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని జనసేన వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే ‘యువ శక్తి’ సభలు నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.