అసెంబ్లీ , లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన
ఏపీలో కూటమితో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన..ఆదివారం 18 అసెంబ్లీ, ఒక లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో 18 సీట్లకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి..మరో మూడు స్థానాలైన అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ లను పెండింగ్ లో పెట్టింది.
అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులు :-
పిఠాపురం- పవన్ కల్యాణ్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేష్
పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు
లోక్సభ బరిలో నిలిచే అభ్యర్థులు :-
కాకినాడ – తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్