జన నాయక్ కర్పూరీ ఠాకూర్
నేడు కర్పూరీ ఠాకూర్ జయంతి
కర్పూరీ ఠాకూర్ ఒక స్వాతంత్య్ర పోరాటవీరుడు. ఆధునిక భారతాన్ని నిర్మించటం కోసం జరిగిన అన్ని ప్రయత్నాల్లో తనదంటూ ముద్రవేసిన సామ్య వాది. నిజాయితీకి మారుపేరు. ముఖ్యంగా రామ్మనోహర్ లోహి యా ప్రభావం బీహార్లో ఎక్కువ. అంబేద్కర్లాగే లోహియా కుల నిర్మూలన జరగాలనీ, కులాధిపత్యం లేని సమాజం నిర్మించడం కోసం గాంధీతో సైద్ధాంతిక యుద్ధం చేశారు. అలాంటి ఆధునిక వాది, సామ్యవాది రామ్మనోహర్ లోహియా ప్రభావంతో కర్పూరీ ఠాకూర్ బీహార్ రాజకీయాలనే కాదు, దేశమంతటికీ ఆదర్శప్రాయ మైన ఎన్నో విధానాలను అందించారు. కర్పూరీ ఠాకూర్ జన హితం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. అందువల్లే ఆయన్ని ‘జన నాయక్ అని ప్రజలు నేటికీ పిలుచుకుంటున్నారు.
దేశ రాజకీయాల మీద, ప్రజాజీవితం మీద మరచిపోలేని ప్రభావం కర్పూరీ ఠాకూర్ చూపారు. లోహియా అనుచరుడిగా, లోక్నాయక్ జయప్రకాశ్ మిత్రుడిగా ఆయన బీహార్ రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు. బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉపముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎనలేని సేవచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బిసి రిజర్వేషన్ను విద్యా,ఉద్యోగ నియామకాల్లో 1978లో ప్రవేశపెట్టారు.
ఈ నిర్ణయం బీహార్ సామాజిక జీవితాన్ని మార్చేసింది. బిసి రిజర్వే షన్లు బలవంతులైన కొన్ని కులాలకే ఉపయోగపడకుండా, ఎంబిసి లకు, సబ్కోటా కూడా ఆయనే కేటాయించి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించారు. కర్పూరీ ఠాకూర్ చేపట్టిన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలన్న డిమాండ్ మేరకే మండల్ కమిషన్ వచ్చింది. బిసి రిజర్వేషన్లు,మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్. మద్యపానం రద్దు, అణగారిన విద్యార్థులకు ఫీజు రద్దు వంటి వాటితోపాటు, బీహార్ను ఆధునికత దిశగా నడిపించే ఆలోచనలెన్నో చేశారు.
సమర్థుడైన పరిపాలనాదక్షుడు. కాన్షీరాం నిర్మించిన బహుజన ఉద్యమానికి బీహార్లో సహాయసహకారాలు అందించారు. బిసిల గౌరవం కోసం ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్ప నాయ కుడు కర్పూరీ ఠాకూర్. అతి సామాన్యమైన అత్యంత వెనుకబడిన వర్గమైన మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న,బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌజియా గ్రామంలో రామ్దులారీ దేవి, గోపాల్ ఠాకూర్ దంపతులకు జన్మించారు. బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీహార్ రాజకీ యాలను శాసిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్కుమార్, రాంవిలాస్ పాశ్వాన్లకు గురువ్ఞ. బి.సి మండల్ కమిషన్, ఓబిసి రిజర్వేషన్ సిఫారసు చేయకముందే 1978లో బీహార్లో ఓబిసి లకు, స్త్రీలకు రిజర్వేషన్ కల్పించారు. దేశవ్యాప్త ఓబిసి, ఎంబిసి ఉద్యమానికి ఆద్యుడు.
సామాజిక అణచివేత, వివక్షల మధ్య కర్పూరీ ఠాకూర్ చదువ్ఞకున్నారు.డిగ్రీ వరకు చదువ్ఞకున్న ఆయన జాతీయోద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. చదువ్ఞ ముగిసిన తర్వాత ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ గ్రామీణు లను చైతన్యం చేశారు.బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతం త్య్రం కోసం పోరాడి జైలుజీవితం గడిపారు. గాంధీజీ ఆలోచన లను ప్రచారం చేశారు.
కానీ కులానికి వ్యతిరేకంగా గాంధీసత్యా గ్రహం చేయాలని డా.అంబేద్కర్, లోహియాలు కోరినప్పుడు గాంధీ, కాంగ్రెస్ తప్పించుకున్న తీరు కర్పూరీ ఠాకూర్ను ఆలోచిం పచేసింది. అంతేకాదు ఎస్సీ,ఎస్టీ బిసిలకు రాజకీయ పౌరహక్కులు కావాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న సమయంలో లండన్లోని రౌండ్టే బుల్ సమావేశాల్లో గాంధీ వైఖరితో కర్పూ రీఠాకూర్నిరాశ చెందా రు. గాంధీ వల్ల మన సమాజంలో ఎలాంటి మార్పురాదని గ్రహించి లోహియా సామ్యవాద సిద్ధాంతం, అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాం తంతో ప్రభావితుడ య్యారు. కాంగ్రెసుకు గాంధీకిదూరంగా జరిగి అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాంతం పోరాడారు.
రామ్ మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టుపార్టీకి అధ్య క్షుడిగా చాలాకాలం సేవలందించారు. స్వాతంత్య్రం వచ్చాక బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగిన ఎన్నికల్లో దేనిలోనూ ఆయన ఓడిపో లేదు.దేశప్రజల ఆకాంక్షలను తీర్చడానికి పాలకులు కృషి చేయాలని బలంగా వాదించారు. నెహ్రూ అభివృద్ధినమూనా పనికిరాదని ఆయన విశ్లేషణ. దేశంలో భూస్వాముల వద్ద పోగుపడిన లక్షలాది ఎకరాలు, ప్రభుత్వ ఆధీనంలోని కోట్లాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేయడం వల్లే ఆర్థిక, సామాజిక సమానత్వంసిద్ధిస్తుందని, తద్వారా దేశం వేగంగా పురోగమిస్తుందని భావించారు.
స్వాతం త్య్రం వచ్చినప్పటికీ పాలకుల మార్పిడి మాత్రమే జరిగింది తప్ప విధానాల్లో ఎలాంటి మార్పులేదని చెప్పారు. 1960లో టాటా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నా రు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 28 రోజులు జైలుజీవితం గడిపారు. అప్పుడు కూడా ఆయన శాసన సభ సభ్యుడే అన్నది గమనించాలి.అహింసాయుత సామాజిక పరివర్తన కోసం సంపూర్ణ విప్లవం నినాదాన్ని జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. జయ ప్రకాశ్ నారాయణ్కు సన్నిహితుడైన కర్పూరీఠాకూర్ జనతాపార్టీలో క్రియాశీల నాయకుడిగా మారారు. 1970లో బీహార్ రాష్ట్రానికి మొదటి బ్రాహ్మణేతర ముఖ్యమంత్రి. అంతకుముందు మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం. ఓబిసి రిజర్వేషన్లను 1978లో ఆయన ప్రవేశపెట్టారు.
ఈ రిజర్వేషన్ పాలసీనే ‘కర్పూరీ ఠాకూర్ ఫార్ములాగా ప్రసిద్ధి గాంచింది. ఓబిసిల ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ కర్పూరీ ఠాకూర్కు కొత్త రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. ఓబిసిలతోపాటు ఎంబిసిలు కూడా అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని కోరుకున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే కేటగిరి కర్పూరీ ఠాకూర్ వల్లే ఏర్పడింది. దళితులు, ఎంబిసిలు, ముస్లింల హితం కోసం ఆయన పనిచేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి బతికారు.
సుదీర్ఘకాలం పాటు బీహార్ రాజకీయాలను, దేశ రాజకీయాలను ఆయన ప్రభావితం చేశారు. సమర్థవంతుడైన పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందారు. ఎన్నడూ అవినీతికి పాల్పడని సచ్ఛీలురు ఆయన. తన 15వ ఏటా విద్యార్థిగా ఉండి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి అరెస్టయి 50 రూపాయలు జరిమానా చెల్లించి, ఒకరోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుంచి ధైర్యం గల చైతన్యవంతుడని నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ గ్రామీణ సమాజంలో ఉద్యమాలు చేసి గుర్తింపుపొందారు. చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతిశాస్త్రాలు అధ్యయనం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ భావాలకు ప్రేరేపితుడై క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 24 నెలలు జైలులో గడిపారు. 1978లో దేశంలోనే మొదటిసారి బీహార్లో బిసిలకు, మహిళలకు, రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించారు. తదనం తరం జరిగిన రాజకీయ పరిణామాలలో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. బిసిల సామాజిక స్థితిగతుల్లో వ్యత్యాసాలు గుర్తించి బిసి వర్గీకరణ చేపట్టి అత్యంత వెనుకబడిన ఎంబిసిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ల దృక్పథానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. కర్పూరీ ఠాకూర్ ఫార్ములాగా ఈ విధానం ప్రసిద్ధి పొంది మండల్ కమిషన్కు ప్రేరణ అయింది. జీవితకాలం లో తను నివసించిన పెంకుటింటికి పైకప్పు మార్చుకోలేని పేద రికం. ఢిల్లీలో తన అధికారనివాసం నుంచి లోక్సభకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే పార్లమెంటేరియన్ని ఎవరితో పోల్చుకోవాలి. ఇక్కడే కర్పూరీ ఠాకూర్ జీవితాన్ని చరిత్రవిస్మరించలేకపోయింది. ఆచరణతో కూడిన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజాస్వామీకరించారు. శత్రుపక్షం సైతం పార్టీలను పక్కన పెట్టి ఆయన్ను గౌరవించారు. 1988 ఫిబ్రవరి 17న అంతిమ శ్వాస విడిచారు.
- వాసిలి సురేష్
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/