టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..

TTD evo Dharma Reddy

కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ నెల 27 లోపు ఆయన జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. టీటీడీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్దీకరణ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.

అయితే.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈవో అమలు చేయకపోవడంతో ముగ్గురు ఉద్యోగులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుచేయలేదని వాళ్లు ఈవోపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ వేశారు. ఉద్యోగుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీతాలు శిక్ష విధించింది.