రూ.1 కే మల్టీప్లెక్స్‌ లో సినిమా చేసే ఛాన్స్..

ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే కనీసం రూ. 300 ఖర్చు అవుతుంది. ఇది కేవలం టికెట్ ధర మాత్రమే..బ్రేక్ లో ఏమైనా స్నాక్స్ తింటే మరో వందో , రెండు వందలో ఖర్చు అవుతాయి. ఇక ఫ్యామిలీ తో మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే కనీసం రూ. 2000 ఖర్చు అవుతుంది. ఇలాంటి ఈ తరుణంలో కేవలం ఒకే ఒక రూపాయికి మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్ కల్పించారు మ్యాక్స్ మల్టీప్లెక్స్‌ థియేటర్ యాజమాన్యం. అది కూడా ఎక్కడో కాదు మన హైదరాబాద్ లో. ఏంటి నమ్మలేకపోతున్నారా…? ఇది నిజం.

హైదరాబాద్ లోని మౌలాలిలో మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్ ను రూపొందించారు. డిసెంబర్ 15న ఈ థియేటర్‌ను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద ఆ రోజు ఒక్క రూపాయికే టికెట్లు విక్రయించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15న మూవీ మ్యాక్స్ మల్టీప్లెక్స్‌లో మెుత్తం 11 సినిమాలు ప్రదర్శించనున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. తెలుగుతో పాటుగా హిందీ సినిమాలు కూడా ప్రదర్శితం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద ఆ రోజు థియేటర్‌లో ఏ సినిమా చూసినా.. ఒక్క రూపాయికే టికెట్ విక్రయించనున్నట్లు వెల్లిడించారు. యశోదా, గుర్తుందా శీతాకాలం, లవ్ టుడే, మసూద, హిట్ -2, చెప్పాలని ఉంది, పంచతంత్రం, కాంతార, భేడియా, దృశ్యం2 సినిమాలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే టికెట్లను బుక్‌ మై షో, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ ఫాంలో ఉంచగా..హాట్ కేకుల్లా అమ్ముడయ్యాని చెపుతున్నారు.