మాణిక్ రావ్ ఠాక్రే కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ..రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కు లేఖ రాసారు. నాలుగు జిల్లాల్లో పాదయాత్ర చేసేందుకు అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేనైన తాను.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలనుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10, హైదరాబాద్లో 15, రంగారెడ్డిలో 8, మహబూబ్నగర్లో 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేతనాని , పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్లో మనో ధైర్యం నింపేందుకు ఆయా జిల్లాల్లో పాదయాత్రకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. కాగా, నిన్నమొన్న టి వరకు తాను విడుదల చేసిన లేఖలు వేరని, ఇప్పుడు ఠాక్రేకి రాసిన లేఖ వేరని జగ్గారెడ్డి తెలిపారు.