‘భీమ్ రావ్ దొర’ గా జగపతిబాబు

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు..ప్రస్తుతం విలన్ గా , క్యారెక్టర్ అరెస్ట్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన రుద్రంగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. టైటిల్ రోల్ ను కన్నడ హీరోయిన్ పోషించింది. మమత మోహన్ దాస్ .. ఆశిష్ గాంధీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా జగపతిబాబు తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

బండి చక్రంతో శత్రువులపై విరుచుకుపడుతూ ఈ పోస్టర్లో జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ‘భీమ్ రావ్ దొర’ పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని చెప్పారు. ‘రుద్రంగి నాది’ అనే జగపతిబాబు డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనిని బట్టి ‘రుద్రంగి పట్ల ఆయనకి గల వ్యామోహం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. ఈ కథ దొరల కాలంలో జరుగుతుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు.