దేశంలో కొత్తగా 3011 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3011 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. ఇందులో 4,40,32,671 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నాయి. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాకు బలయ్యారు. మరో 36,126 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 28 మంది మరణించగా, 4301 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసుల్లో 0.08 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.2 శాతం ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ వెల్లడించింది. ఇందులో 94.87 కోట్ల మంది రెండో డోసు తీసుకోగా, 21.41 కోట్ల మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారని పేర్కొన్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/