జగన్ అన్నదే విజయం – అంబటి రాంబాబు

ambati-rambabu

ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ విజయం సాదించబోతుందని..జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు మంత్రి అంబటి రాంబాబు. మే 13 న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే . గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం పెరగడం తో కూటమి నేతల్లో విజయం ఫై మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని..150 సీట్లకు పైగా విజయం సాదించబోతున్నామని కూటమి నేతలు చెపుతుంటే..ఇటు వైసీపీ నేతలు సైతం తమ గెలుపు ఫై ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… కూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా… జగన్ అన్నదే విజయం అని చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి తొత్తులుగా కొందరు పోలీసు అధికారులు వ్యవహరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులను కూడా హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఎస్, డీజేపీలను ఢిల్లీకి రావాలంటూ ఈసీ ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, తన నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.