నాలుగున్నరేళ్లలో రోడ్ల గురించి జగన్ పట్టించుకోలేదుః దేవినేని ఉమా

రాష్ట్ర పరువును రోడ్డున పడేశారని మండిపాటు

devineni uma
devineni uma

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కాగా, కెసిఆర్ మళ్లీ రాకపోతే మనది కూడా అమరావతి అవుతుందని హరీశ్ చేసిన వ్యాఖ్యలు వీడియోలో ఉన్నాయి. ఏపీ రోడ్ల దుస్థితిపై కెసిఆర్ చేసిన కామెంట్ వీడియోలో ఉంది.