విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో జగన్
అమరావతిః సిఎం జగన్ ఈరోజు విశాఖలోని శ్రీ శారదాపీఠాని వెళ్లారు. ఈ మేరకు ఆయన శారదాపీఠం వార్షికోత్సవ వేదుకల్లో పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు శారదాపీఠం వద్ద జగన్ కు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు.