చీకోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు..

chikoti praveen

చీకోటి ప్రవీణ్‌ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.క్యాసినో కింగ్ గా ఈయన మంచి గుర్తింపు ఉంది. ఇప్పయికే క్యాసినో వ్యవహారంలో దేశ వ్యాప్తంగా మారుమోగగా..తాజాగా మరోసారి ఈయన పేరు వార్తల్లో హైలైట్ అవుతుంది. తాజాగా ఐటీ శాఖ ప్రవీణ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో నోటీసులు పంపడం జరిగింది. మూడు కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును చీకోటి ప్రవీణ్.. తన బినామీ పేరు మీద తీసుకున్నట్టు తెలిసింది. అయితే.. ఈ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ ఐటీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కారును భాటియా ఫర్నిచర్ పేరుతో కొనుగోలు చేశాడు చీకోటి ప్రవీణ్.

ఇదిలా ఉంటె ఇటీవలే సైదాబాద్‌లో ఉన్న చీకోటి ప్రవీణ్ కుమార్ ఇంట్లో కారు చోరీ జరిగింది. కొంత మంది దుండగులు అర్ధరాత్రి వేళ చీకోటి ఇంటికి వచ్చి కారును దొంగిలించారు. చోరీకి ముందు ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత వాళ్లలో ఒకడు గేటు దూకి చీకోటి ఇంట్లోకి ప్రవేశించి మరీ.. కారు తాళాలను తీసుకొచ్చాడు. అనంతరం పార్కింగ్ ప్రాంతంలో ఉన్న కారును తీసుకొని పరారయ్యాడు. నిద్రలేచి చూసేసరికి పార్కింగ్ చేసిన కారు లేకపోవడంతో చీకోటి ప్రవీణ్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాడు. సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గరు యువకులు వచ్చి కారును చోరీ చేసినట్టు కనిపించింది. దీంతో.. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు.