కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయినా ఇండిగో విమానం

షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకనటలో తెలిపింది.

‘షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.’ అని ఇండిగో ప్రకటనలో తెలిపింది.

ఇండియా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం సడెన్ గా కరాచీలో ల్యాండ్​ అవడం.. 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఢిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్​లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్​ ఇండికేటర్​ సరిగా పనిచేయలేదు. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్​ను భారత్​ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.