కిలీ పాల్కు భారత హైకమిషన్ సత్కారం
ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్ను టాంజానియా లోని భారత హైకమిషన్ సత్కరించింది. హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీ పాల్తో భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కిలీ పాల్ టిక్ టాక్ వీడియోల నుంచి వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఇన్స్టా, తదితర సోషల్ మీడియా సైట్లల్లో ఆయన ఫాలోవర్లు రెండు మిలియన్లకు పైగా ఉన్నారు. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటకు కూడా స్టెప్పులేసి కిలీ పాల్ తన ఫాలోవర్లను ఫిదా చేశాడు . కిలీ పాల్ను సత్కరించిన ఫొటోలను భారత హైకమిషన్ ట్విట్టర్లో షేర్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/