గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద శోకసంద్రం

ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో చేరుకున్న పార్ధివదేహం

Gautam Reddy dead body reached home
Gautam Reddy dead body reached home

Nellore: మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహం ఇక్కడి డైకస్ రోడ్డులోని ఆయన నివాసానికి చేరుకుంది. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. వేలాది అభిమానులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో మంత్రి నివాసం కిక్కిరిసిపోయింది. మంత్రి పార్ధివదేహాన్ని చివరిసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు తరలివస్తున్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి పార్ధివదేహాన్ని నెల్లూరుకు తీసుకొచ్చారు. తమ నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకోనున్నారు. రేపు అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియులు నిర్వహించనున్నారు.

తెర – (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/