12-14 ఏండ్ల పిల్లలకు కోవిడ్ టీకాలు
60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో 12- 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16 (బుధవారం) నుంచే ఈ వయసు పిల్లలకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు సోమవారం కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి కాసేపటి క్రితం జారీ అయిన ఆదేశాల ప్రకారం 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/