ఆ దేశం అమెరికాకు ప‌ది ట్రిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించాలి

వాషింగ్ట‌న్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి క‌రోనా వైర‌స్ విషయం స్పందించారు. గురువారం ఆయ‌న ఫాక్స్ న్యూస్ ఇంట్వ‌ర్వ్యూలో మాట్లాడారు. మ‌హ‌మ్మారితో ఇండియా విల‌విల‌లాడిన‌ట్లు అన్నారు. అయినా ఆ దేశం అద్భుత రీతిలో కోలుకుంటోంద‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి చెంద‌డానికి చైనానే కార‌ణ‌మ‌ని, ఆ దేశం అమెరికాకు ప‌ది ట్రిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించాలంటూ పేర్కొన్నారు.

వుహాన్ ల్యాబ్ నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు. చైనా అస‌మ‌ర్థ‌త వ‌ల్లే వుహాన్ ల్యాబ్‌లో ఆ ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని ట్రంప్ అనుమానం వ్య‌క్తం చేశారు. కానీ ఆ ప్ర‌మాదం గురించి చాలా తెలుసుకోవాల‌ని, ఎలా జ‌రిగింది, ఎందుకు జ‌రిగింద‌న్న కోణంలో విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. అలాంటి వైర‌స్ ప్ర‌యోగాల స‌మయంలో ఎలా అస‌మ‌ర్ధంగా ఉంటార‌ని ట్రంప్ ప్ర‌శ్నించారు. నిజానికి మ‌న‌కు వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, కానీ మ‌రీ యువ‌కుల‌కు వ్యాక్సిన్లు ఇవ్వాల‌న్న టెన్ష‌న్ వ‌ద్దు అని, ఆ ప్ర‌క్రియ‌ను ఆపాల‌న్నారు. ఎందుకంటే దేశాన్ని ఆర్థికంగా న‌డ‌పాల్సిన స‌మ‌యం ఇది అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/