ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

bus, truck collide in Brazil

బ్రసిలియా: దక్షిణ బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అతివేగంగా వచ్చిన ట్రక్కు నేరుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్వోపౌలో రాష్ట్రంలో టగ్వాయ్‌ పట్టణ సమీపంలో టగ్వాయ్‌తక్వరితుబా రహదారిపై ఉదయం 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాదం కారణంగా రహదారిపై దాదాపు 4 గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. చనిపోయిన 32 మందికి సంతాపంగా టగ్వాయ్‌ మున్సిపాలిటీ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/