స్వతంత్ర అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులు

ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ గుర్తుతో పోటీ చేయడం లేదు

పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుంది

Pawan kalyan
Pawan kalyan

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తారని జనసేన పార్టీ తెలిపింది. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలిపారు. అయితే తమ అభ్యర్థులు పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీచేయడంలేదన్నారు. ఈ మేరకు వివరాలను జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీచేయడం లేదని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొంటూ.. ఆసక్తి ఉన్న వారు స్వంతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని సూచించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనికి అనుమతిచ్చారని తెలిపింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/