ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఎన్సీపీలోనే ఉంటాః అజిత్ పవార్
ముంబయిః ఎన్సీపీ నేత అజిత్ పవార్ బిజెపిలోకి వెళ్తున్నట్లు ప్రచారం రావడంపై ఆయన స్పందించారు. ఎటువంటి కారణం లేకుండా మీడియా రూమర్లు వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్సీపీలో ఉన్నానని, ఎన్సీపీలోనే ఉంటానన్నారు. 40 మంది ఎమ్మెల్యేల నుంచి తానేమీ సంతకాలు తీసుకోలేదని, వాళ్లు కేవలం తనను కలిసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఇది రొటీన్ ప్రక్రియ అని, దీంట్లో మరో ఉద్దేశం లేదన్నారు. ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారని, అయితే వాళ్లేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ ఏర్పడిందని అజిత్ పవార్ తెలిపారు.