నష్టాలల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 183.74 పాయింట్లు నష్టపోయి 59,727.01 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.60 పాయింట్ల నష్టంతో 17660.20 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.04 వద్ద కొనసాగుతుంది.