సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు అస్వస్థత
పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స
paarvatipuram : రాష్ట్రంలోని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర సోమవారం అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రారంభం సందర్భంగా సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడంతో వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చారు. అస్వస్థత కారణంగా, పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/