శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం
స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేత
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర దాల్చింది. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం పూర్తి గా దెబ్బతినడంతో సంక్షోభం మరింత ఉధృతం అవుతోంది. దీంతో సోమవారం శ్రీలంక స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 5.9 శాతం కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షీణించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నిలిపివేశారు. ప్రధాన కంపెనీలు షేర్లన్నీ భారీగా నష్టపోయాయి. అరగంట పాటు ట్రేడింగ్ను నిలిపివేసినట్లు కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది.
జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/