ఏపిలో మరో 275 కొత్త పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసులు 5,555
అమరావతి: ఏపి కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 15,188 శాంపిళ్లను పరీక్షించగా మరో 275 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 5,555 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 2,559 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,906 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 90కి చేరింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/