ప‌వ‌న్ సీఎం అయితే..రాష్ట్రం స్వ‌ర్ణ‌యుగం అవుతుంది – నాగబాబు

‘జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర సీఎం అయితే, స్వ‌ర్ణ‌యుగం వ‌స్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం.. రాష్ట్రంలో రానున్న‌ది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే’ అని ధీమా వ్యక్తం చేసారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అధికారపార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీ లు ప్రజల్లోకి వెళ్తూ..వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో జనసేన సైతం స్పీడ్ పెంచింది.

తాజాగా అనకాపల్లి జిల్లాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించారు. ఎలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయితే, స్వ‌ర్ణ‌యుగం వ‌స్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం.. రాష్ట్రంలో రానున్న‌ది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి పవన్ కి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నది’ అని గుర్తు చేశారు.