జగన్ అన్నా ను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందిః రోజా

If Jagan trusts Anna, there will be a future: Roja

అమరావతిః ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తున్నారన్న వార్తలపై…మంత్రి రోజా స్పందించారు. వైఎస్ షర్మిల రాకతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు..ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయచ్చు…ప్రచారం చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎవరికి భయపడరని తేల్చి చెప్పారు.

మా ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీకి టచ్ ఉన్నామని చెప్పుకోవడం వారి శునాకానందమే నని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ పని తాము చేసుకుంటూ వేళ్ళడమే జగన్ కు తెలుసు అని తెలిపారు. జగన్ అన్నా ను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జగన్ ను కాదని వెళితే.. సూసైడ్ చేసుకున్నట్లేనని తేల్చి చెప్పారు. టికెట్ రానీ వాళ్ళకు సరైన విదంగా గౌరవం పార్టీ ఇస్తుందని తెలిపారు. చంద్రబాబుకు పవన్ తో కలసి 175 చోట్ల అభ్యర్ధుల దోరకడం లేదని చురకలు అంటించారు.