మునుగోడులో గెలిస్తే..వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి గెలుపు ఖాయం – వివేక్

,

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలిస్తే..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి గెలుపు ఖాయమన్నారు కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. మునుగోడు ప్రచారంలో బిజీ గా ఉన్న వివేక్ వెంకటస్వామి గురువారం మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్లు మద్యం, డబ్బుతో ఓటర్ల మైండ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ గుర్తు ప్రతి ఇంటికి చేరేలా పనిచేయాలని మహిళా మోర్చా నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్ అందించిన విషయాన్ని ఓటర్లకు గుర్తు చేయాలని తెలిపారు. యూపీలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తారన్న భరోసా కల్పించాలని తెలిపారు.